నూతన విద్య విధానంలో భాగంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు. కేంద్ర సాంస్కృతిక మంత్రి G.కిషన్ రెడ్డి - 250 ప్రభుత్వ పాఠశాలలకు టాయ్ లెట్ క్లీనింగ్ మెషిన్ లు పంపిణీ 10-12-2022 న హైదరాబాద్ లోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 250 ప్రభుత్వ పాఠశాలలకు టాయ్ లెట్ క్లీనింగ్ మెషిన్ లని ఆయన పంపిణీ చేశారు. అనంతరం రూ.21 లక్షల తో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గది, లాబొరేటరీని ప్రారంభించారు. పంపిణీ చేసిన క్లీనింగ్ మెషిన్ పనితీరును పరిశీలించిన మంత్రి కిషన్ రెడ్డి తనే స్వయంగా పాఠశాల టాయ్ లెట్ లను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమాజం, తల్లితండ్రుల కమిటీలు పాఠశాలల పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు నిర్మాణం తర్వాత నిర్వహణ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలి అని పిలుపు ఇచ్చారు.