ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోది గారు (27-1-2023) నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో హైదరాబాద్ లోని మెరీడియన్ పాఠశాల విద్యార్థులతో కలిసి వర్చువల్ గా పాల్గొన్నాను. కార్యక్రమంలో భాగంగా, డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం దగ్గర నుండి తమ పిల్లలపట్ల సరైన అంచనా వేయాలని తల్లిదండ్రులకు సూచించడం, పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడానికి పిల్లలకు అవసరమైన సూచనలుచేయటం వరకు అనేక అంశాలను గురించి గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడటం జరిగింది. నా ప్రసంగంలో భాగంగా, జీవితంలో మరియు పరీక్షల సమయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడంలో ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోది గారు చేసిన మార్గదర్శనం పిల్లల జీవనంలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఎంతగా ఉపయోగపడిందనే విషయాన్ని గురించి మాట్లాడటం జరిగింది.