1Nation 1 Fertilizer
17 October 2022
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ₹16 వేల కోట్ల 12 వ విడత నిధులను నేడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులఖాతాలలో జమ చేస్తున్న సందర్భంగా ఏపీలోని ఏలూరులో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం,అభివృద్ధి కోసం,వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం PM శ్రీ @narendramodi గారు చేపట్టిన అనేక కార్యక్రమాలను గురించి రైతులకు వివరించాను. #PMKisan పథకం ప్రారంభించిననాటి నుండి ఇప్పటి వరకు ₹2 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. అన్ని విధాలుగా రైతుల అవసరాలను తీర్చటానికి వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల షాపులను విడతల వారీగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 600 PM కిసాన్ సమృద్ధి కేంద్రాలను మోదీ గారు నేడు ప్రారంభించారు. అంతేకాకుండా దేశమంతా ఒకే పేరుతో ఎరువులను అందించటం కోసం ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ పథకం కూడా నేడు ప్రారంభమైంది.