4-7-2023-హైదరాబాద్ లో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొన్నాను. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది గారి చేతుల మీదుగా ప్రారంభించబడి ఏడాది పాటు స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు విప్లవ వీరుడు, రంప తిరుగుబాటు నాయకుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి చిరకాల గుర్తింపుతో పాటు, భారత సంస్కృతి, గిరిజనులకు, స్వాతంత్ర్య సంగ్రామంలో వారు చూపిన తెగువ, పరాక్రమం, అందించిన సహకారానికి మంచి గుర్తింపునిచ్చాయి. ఈ వేడుకలను ఉద్దేశించి గౌరవ భారత రాష్ట్రపతి గారు మాట్లాడుతూ అన్యాయం, దోపిడీపై అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక గర్వించదగిన అధ్యాయమని అన్నారు. అల్లూరి దేశభక్తి, ధైర్యసాహసాలను గురించి ప్రజలంతా ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలన్నారు. గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలను ప్రారంభించి, ప్రసంగించారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు.